
అలీకి వీసా సమస్యలు
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీకి 20 రోజులుగా ఇండియా రావడానికి వీసా లభించడం లేదు. దీంతో అతను ఇంకా ఇంగ్లండ్లోనే ఉన్నాడు. దీంతో మొయిన్ అలీ వీసా సమస్యలపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. మొయిన్ అలీ ఫిబ్రవరి 28నే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. 20 రోజులు గడిచినపోయినప్పటికీ అతనికి ఇంకా వీసా రాలేదని, దీనికి గల కారణమెంటో తెలియదని ఆయన తెలిపారు. నిజానికి అలీ తరచుగా ఇండియాకు వస్తుంటాడని చెప్పారు. అయితో టోర్నమెంట్ ప్రారంభమవడానికి ముందే అలీ జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.

బీసీసీఐ ప్రయత్నాలు
దీని కోసం బీసీసీఐ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తుందని విశ్వనాథ్ వివరించారు. సోమవారం నాటికి మెయిన్ అలీ వీసా సమస్య పరిష్కారమవుతందని ఆశిస్తున్నట్లు సీఎస్కే సీఈఓ తెలిపారు. కాగా అలీకి వీసా రావడం మరింత ఆలస్యమైతే అతని ఆరంభ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు 3 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఇది పూర్తి చేసుకోని అలీ జట్టులో చేరే సమయానికి కోల్కతానైట్రైడర్స్తో చెన్నైసూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ అయిపోయే అవకాశం ఉంది. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. అలీ వీసా సమస్యలు తొలగిపోయి త్వరగా ఇండియా రావాలని కోరుకుంటున్నారు. కాగా మొయిన్ అలీని మెగా వేలానికి ముందే చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

గుజరాత్ కోచింగ్ స్టాఫ్కు కూడా వీసా సమస్య
కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కోచింగ్ సిబ్బందిలోని మొయిన్, అబ్దుల్ నయీమ్ కూడా వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం యూకేలో ఉన్న వీరిద్దరు యూకేలో వీసా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమై ఇండియా చేరుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా నయీమ్ గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్లో కూడా పనిచేశాడు. ఇక ఐపీఎల్ 15 ఎడిషన్ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానుందని తెలిసిందే.

చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి జట్టు
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)


Click it and Unblock the Notifications
