
అత్యుత్తమ జట్టుపై అద్భుత బౌలింగ్
చివరి ఓవర్లో 9పరుగులు అవసరమైన దశలో రోహిత్ బంతిని సామ్స్కు ఇచ్చి పలు సూచనలు చేశాడు. వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ మాత్రమే వేయాలంటూ సామ్స్కు చెప్పాడు. రోహిత్ సూచనలతో పాటు తన మెలకువలతో బౌలింగ్ చేసిన ఈ ఆస్ట్రేలియన్.. ఆఖరి ఓవర్లో తొమ్మిది పరుగులు డిఫెండ్ చేయడాన్ని సమర్థంగా పూర్తి చేశాడు. ఈ సీజన్లనే అత్యుత్తమ జట్టైన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను.. అది కాకుండా ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ఫినిషింగ్ స్టార్లు అయిన రాహుల్ తెవాతీయా, మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ల నుంచి పరుగులు రాకుండా అడ్డుకున్నాడు.
స్టేడియంలో సంబరాలు
ఆఖరి ఓవర్లో సామ్స్ రాహుల్ తెవాతీయా వికెట్ తీయడంతో పాటు చివరి ఓవర్లో కేవలం మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ముంబై 5పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయం అనంతరం ముంబై ప్లేయర్లు, అభిమానులు ఎనలేని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. స్టేడియం మొత్తం ముంబై నామస్మరణతో మారుమ్రోగింది.
రణవీర్ సింగ్ సందడే సందడి
ఇక ఈ మ్యాచ్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ ఆద్యంతం మ్యాచ్ వీక్షిస్తూ ముంబై జట్టును ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. బౌండరీలు కొట్టినప్పుడు సిక్సర్లు కొట్టినప్పడు సెలబ్రేట్ చేసుకుంటూ సందడి చేశాడు. ఇక చివరి ఓవర్లో ఉత్కంఠకర పరిస్థితుల్లో రణవీర్ సైతం నరాలు బిగపట్టి మ్యాచ్ వీక్షించాడు. తెవాతీయా ఔటయినప్పుడు, ఇక చివరి బంతికి గెలిచినప్పుడు కమాన్ అంటూ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఊగిపోయాడు.
రోహిత్, ఇషాన్, డేవిడ్ రాణించడంతో..
ఇక గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 55), శుభ్మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.


Click it and Unblock the Notifications












