
కొంప ముంచిన డేనియల్ స్లామ్స్
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ దశలో రోహిత్ సేన విజయం ఖాయంగా కనిపించింది. కానీ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెలరేగడంతో ఢిల్లీ గెలిచింది. 104 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి వీరిద్దరు అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే మరో 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన సమయంలో 18వ ఓవర్ వేయమని డేనియల్ సామ్స్కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బాల్ ఇచ్చాడు. అప్పుడు క్రీజులో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు.

ఏకంగా 24 పరుగులు ఇచ్చేశాడు
ఇక డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని అక్షర్ పటేల్ సిక్సు బాదాడు. రెండో బంతికి సింగిల్ తీయగా.. లలిత్ యాదవ్ స్ట్రైకింగ్కు వచ్చాడు. ఆ ఓవర్ మూడో బంతిని సిక్సు బాదిన లలిత్ యాదవ్.. నాలుగో బంతిని ఫోర్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఆరో బంతిని అక్షర్ పటేల్ సిక్సు బాదేశాడు. ఆ ఓవర్లో వరుసగా 6 1 6 4 1 6 పరుగులు వచ్చాయి. అంటే ఆ ఒక్క ఓవర్లోనే 24 పరుగులు రావడంతో మ్యాచ్ ముంబై చేయి జారిపోయింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలోనే డేనియల్ సామ్స్ 57 పరుగులిచ్చి ముంబై ఓటమికి కారణమయ్యాడు. ఢిల్లీ విజయానికి మరో 4 రన్స్ మాత్రమే కావడంతో 19వ ఓవర్లో ఢిల్లీ విజయాన్ని అందుకుంది.

భారీగా పరుగులిచ్చి సిరాజ్
పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ అచ్చం ఇదే మాదిరిగా జరిగింది. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మహ్మద్ సిరాజ్ వేసిన 18వ ఓవర్తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్ తొలి 3 బంతులను ఓడియన్ స్మిత్ 6, 4, 6 బాదాడు. ఆ తర్వాత ఓ సింగిల్ రాగా, చివరి బంతిని ఓడియన్ స్మిత్ మళ్లీ సిక్స్ బాదాడు. మొత్తంగా ఆ ఓవర్లో 25 పరుగులు రావడంతో మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓవర్లో విజయాన్ని అందుకుంది. కాగా ఈ రెండు ఓవర్లలో మొదటి, మూడో, చివరి బంతులను కామన్గా సిక్సులు బాదడం గమనార్హం. ఇలా ఒకే రోజు ఒకే విధంగా జరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications
