న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!

 IPL 2021: SRH lose home advantage as no Hyderabad in BCCI’s list of shortlisted venues

న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. నగరవాసులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 సీజన్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈసారి కూడా లేదు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ లీగ్‌.. చివరికి భారత్‌ నుంచి యూఏఈకి తరలిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌ స్వదేశంలోనే జరగబోతోంది కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షార్ట్ లిస్ట్ చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లను 6 వేదికలకే పరిమితం చేయనున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. వాటిలో ఉప్పల్‌ రాజీవ్ గాంధీ స్టేడియం లేదని తెలుస్తోంది.

 ముంబైకి చోటు..

ముంబైకి చోటు..

ప్రస్తుతానికి చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముంబైని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే చేర్చారు. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలో మ్యాచ్‌లు వీలు కాని పక్షంలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని బోర్డు పెద్దలు భావించారు. కానీ ముంబైలో మ్యాచ్‌లకు అనుమతి లభించడంతో హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను పక్కన పెట్టారు. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో వీలైనన్ని తక్కువ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

 మాకు బ్యాడ్ న్యూస్..

మాకు బ్యాడ్ న్యూస్..

ఈ లెక్కన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ హోం గ్రౌండ్స్‌‌కు దూరం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే.. తమ జట్టుకు, అభిమానులకు గుండె పగిలే వార్తేనని హోం గ్రౌండ్ కోల్పోయిన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ అధికారి తెలిపాడు. 'ఐపీఎల్ వేదికల గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటి వరకు మాకు అధికారిక సమాచారం ఇవ్వలేదు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగకపోతే మా అభిమానులకు నిరాశ పరిచే వార్తే.'అని తెలిపాడు.

 అందుకే అహ్మదాబాద్..

అందుకే అహ్మదాబాద్..

గతంలో మాదిరి వేర్వేరు జట్లు వేర్వేరు వేదికల్లో తలపడటం కాకుండా.. జట్లన్నింటినీ ఒకే చోట ఉంచి వరుసగా ఒక స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించి.. తర్వాత మరో వేదికకు అన్ని జట్లనూ తరలించి అక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా బోర్డు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితేనే క్వారంటైన్‌ నిబంధనలు పాటించడానికి వీలుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరాలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే లీగ్‌కే కళ వస్తుందన్న ఉద్దేశంతో అహ్మదాబాద్‌ కేంద్రంగా ఏ ఫ్రాంఛైజీ లేకపోయినా దాన్ని ఒక వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ వీక్‌లో షెడ్యూల్..

ఫస్ట్ వీక్‌లో షెడ్యూల్..

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మార్చి ఫస్ట్ వీక్‌లో సమావేశం కానుంది. ఈ భేటీలో ఐపీఎల్ 2021 షెడ్యూల్‌‌ను ఖారారు చేయనుంది. భారత్‌లోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న బోర్డు.. ఎప్పటికప్పుడూ పరిస్థితులను పరిశీలిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుందని పుకార్లు వినిపిస్తున్నా.. బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్.. నెల ముందుగానే షెడ్యూల్‌ను ప్రకటించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది.

Story first published: Sunday, February 28, 2021, 13:53 [IST]
Other articles published on Feb 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X