రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నీలో ఎప్పుడూ అద్భుతాలు సృష్టిస్తూ వచ్చింది. ఐపీఎల్ తొలి టైటిల్ను కైవసం చేసుకున్న ఈ జట్టు ఈ సారి జట్టులో పెను మార్పులు చేసింది. వేలంపాటలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇక సంజు శాంసన్ నేతృత్వం వహిస్తున్న ఈ జట్టు ఈ సారి మంచి ప్రదర్శన కనబర్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ చేరికతో ఈ జట్టు బలంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి