
ఫిట్నెస్ కోసం..
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఫించ్ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టుకు అలెక్స్ క్యారీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. వెస్టిండీస్తో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా సెయింట్ లూసియాలో ప్రాక్టీస్ చేస్తూ అతను గాయపడ్డాడు. కుడి మోకాలికి గాయమైంది. దీనికి సర్జరీ అవసరమైంది. గాయం కారణంగా టీ20 సిరీస్, వన్డే ఇంటర్నేషనల్స్కు ఆరోన్ ఫించ్ దూరమయ్యాడు. ఫలితంగా- వెస్టిండీస్ పర్యటన ముగిసిన తరువాత ఫించ్..జట్టుతో పాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లట్లేదు. స్వదేశానికి తిరుగుముఖం పడతాడు.

ఐపీఎల్.. టీ20 వరల్డ్ కప్
అనంతరం మోకాలికి సర్జరీ చేయించుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతోంది. ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్లతో పాటు టీ20 ప్రపంచకప్కు అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో వెస్టిండీస్తో జరిగే మిగిలిన మ్యాచ్లు, బంగ్లాదేశ్ సిరీస్లో ఆడకూడదని ఆరోన్ భావిస్తోన్నట్లు తెలిపింది. యుఏఈ, ఒమన్లల్లో నిర్వహించబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ నాటికి ఆరోన్ ఫించ్ అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ ఆఫీసర్స్ అంచనా వేస్తోన్నారు. వెస్టిండీస్ నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టిన తరువాత అతను రెండువారాల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. ఆ తరువాత సర్జరీ చేయించుకుంటాడని తెలుస్తోంది.

అలెక్స్ క్యారీ కేప్టెన్సీ..
ఆరోన్ ఫించ్ ఆబ్సెన్సీలో ఆస్ట్రేలియా జట్టుకు అలెక్స్ క్యారీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. అతని నేతృత్వంలోని ఆసీస్ జట్టు విండీస్ను ఢీ కొంటోంది. ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. తొలి వన్డేలో దారుణ పరాజయాన్ని చవి చూసింది కరేబియన్ టీమ్. రెండో వన్డేలో ప్రతీకారాన్ని తీర్చుకుంది. బ్రిడ్జిటౌన్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 47.1 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన వెస్టిండీస్ జట్లు ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి, విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications
