
ఆరేళ్ల తరువాత:
ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 83 పరుగులు చేసిన మనీశ్ పాండేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీంతో ఆరేళ్ల తరువాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాండే అందుకున్నాడు. అంతేకాదు స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, సురేష్ రైనాల సరసన చేరాడు. భారత ఆటగాళ్లు అయిన రోహిత్, రైనాలు భారత్, దక్షిణాఫ్రికా, యూఏఈలో జరిగిన ఐపీఎల్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా దుబాయ్ గడ్డపై ఈ అవార్డు గెలుచుకోవడంతో మూడు దేశాల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.

తొలి భారతీయ జోడి:
ఈ మ్యాచ్లో మనీష్ పాండే, విజయ్ శంకర్ కలిసి 140 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు. దీంతో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి భారతీయ జోడిగా నిలిచారు. 2013లో కోల్కతాపై పార్థివ్ పటేల్, శిఖర్ ధావన్లు 89 పరుగులు చేశారు. సన్రైజర్స్ తరఫున ఐపీఎల్లో 3వ వికెట్కు అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. 2018లో పాండే-కేన్ విలియమ్సన్ 135 రన్స్ చేశారు.
నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం:
'ఇద్దరు మేటి బ్యాట్స్మన్ త్వరగానే ఔటైపోయారు. ఇప్పటికే సన్రైజర్స్ మిడిలార్డర్పై చాలా చర్చ జరుగుతోంది. నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. క్రీజులో ఉండి షాట్లు ఆడాలని అనుకున్నా. ఆ విధంగానే చేశా. చాలా సంతోషంగా ఉంది. జోఫ్రాను ఎదుర్కొనేందుకు మేము వేసుకున్న ప్రణాళికలు సఫలం అయ్యాయి. జట్టు విజయం సాధించడంలో నా పాత్ర ఉన్నందుకు ఆనందపడుతున్నా. విజయ్ శంకర్ బాగా ఆడాడు. ఇదే ఫామ్ మిగిలిన మ్యాచులలో కొనసాగించడానికి ప్రయత్నిస్తాం' అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సమయంలో చెప్పాడు.


Click it and Unblock the Notifications
