దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. రాజస్థాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బెంగళూరు తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. ఆల్రౌండర్ శివమ్ దూబే, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్పై వేటు వేసి.. గుర్కీరత్ మన్ సింగ్, షబాజ్ అహ్మద్ని టీమ్లోకి తీసుకున్నాడు.
ఈ సీజన్లో బెంగళూరు 8 మ్యాచులు ఆడి.. 5 విజయాలు అందుకుని 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో రెండు విజయాలు సాధిస్తే..ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం. మరోవైపు రాజస్థాన్ మూడు విజయాలు మాత్రమే అందుకుని పట్టికలో 7వ స్థానంలో ఉంది. దీంతో ఆర్ఆర్ జట్టుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే. అన్ని మ్యాచులు గెలిస్తేనే అధికారిక ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది.
ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకూ 21సార్లు ఎదురుపడ్డాయి. అందులో 10 మ్యాచుల్లో రాజస్థాన్ పైచేయి సాధించింది. 9 మ్యాచులలో బెంగళూరు గెలిచింది. ఇక రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన చేతిలో రాజస్థాన్ ఓడింది. ఆ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఆర్ఆర్ ప్రతీకారం తీర్చుకోవాలనిచూస్తోంది.
తుది జట్లు:
బెంగళూరు: దేవ్దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, గుర్కీరత్ మన్ సింగ్, క్రిస్ మోరిస్, షాబాజ్ అహ్మద్, ఉరుసు ఉదాన, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్.
రాజస్థాన్: బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తిక్ త్యాగి.