ఐపీఎల్ తొలి ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో భారీ మార్పులతో బరిలోకి దిగుతుంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో తమ జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేను ఢిల్లీ క్యాపిటల్స్కు ఇచ్చేసిన రాజస్థాన్.. ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ను మరోసారి కెప్టెన్గా ఎంచుకుంది. ఈ సారైనా మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆ జట్టు కోరుకుంటుంది. అయితే సీజన్ ప్రారంభమవ్వక ముందే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో అతని సేవలను కోల్పోయింది. ఈ జట్టుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.