గతేడాది భారీ మార్పులతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది. ప్రారంభంలో అద్భుత విజయాలతో అదరగొట్టిన ఈ జట్టు... ఆఖర్లో మాత్రం తడబడి ప్లే ఆఫ్ కూడా చేరలేకపోయింది. దీంతో మరోసారి జట్టును ప్రక్షాళన చేసిన ఫ్రాంఛైజీ.. కెప్టెన్ అశ్విన్ను ఢిల్లీకి ట్రేడ్ చేసుకొని టీమిండియా సూపర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించుకుంది. వేలంలో కూడా టాలెంటెడ్ ప్లేయర్లను దక్కించుకున్న పంజాబ్.. ఈసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. పంజాబ్ జట్టుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.