ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు మరోసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆరంభంలో తడబడుతూ.. ఆఖర్లో అనూహ్యంగా రేసులోకి వచ్చే ఈ జట్టును ‘లేట్ బ్లూమర్స్’అని పిలుస్తుంటారు. అయితే ఈ సారి అలాకాకుండా ఆది నుంచే అదరగొట్టాలని భావిస్తోంది. ముంబై జట్టుకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.