షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో దుబాయ్లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్తో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక సన్రైజర్స్ పలు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. అతని స్థానంలో సందీప్ శర్మ జట్టులోకి వచ్చాడు. సిద్దార్థ్ కౌల్ కూడా ఆడుతున్నాడు. భువీ లేకపోవడం సన్రైజర్స్కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా భువీ లేకపోవడం మాకు పెద్ద లోటు అని చెప్పాడు.
సీజన్-13లో రెండు జట్లు ఇప్పటివరకు ఐదేసీ మ్యాచ్లు ఆడి.. రెండేసి మ్యాచ్లలో విజయం సాధించాయి. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్రైజర్స్.. ఈ మ్యాచ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. ఇక బెంగళూరు మ్యాచ్లో ఓడిన ముంబై.. ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఈ రోజు మ్యాచ్ జరిగే షార్జా మైదానం చిన్నదిగా ఉంటుంది. చిన్న స్టేడియంలో ఇరు జట్లలోని హిట్టర్లు సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు హై స్కోరింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెరో 7 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. అయితే గత 5 మ్యాచుల్లో ఫలితాలు గమనిస్తే.. హైదరాబాద్ కాస్త పైచేయి సాధించింది. మూడు విజయాలతో ముంబైని వెనక్కి నెట్టింది. గతంలో ఇక్కడ మ్యాచులో హైదరాబాద్ విజయం సాధించింది.
జట్లు:
ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టీ నటరాజన్.