గరిష్టంగా 73 మందిని మాత్రమే
వేలంలో గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంపికచేసుకునే అవకాశం ఫ్రాంఛైజీలకు ఉంది. అయితే, వేలంలో అత్యధిక బేస్ ప్రైజ్ కలిగిన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీద్దాం. రూ. 2 కోట్ల క్లబ్లో ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజల్ఉడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, డేల్ స్టెయిన్, ఏంజెలో మ్యాథ్యూస్లు ఉన్నారు.
|
రూ. 2 కోట్ల క్లబ్లో ఉన్న ఆటగాళ్లు వీరే
వీరందరి కనీస ధర రూ. 2 కోట్లు. వీరిని వేలంలో ప్రాంఛైజీలు సొంతం చేసుకోవాలంటే కనీస ధర లేదా అంతకుమించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక, రూ. 1.5 కోట్ల క్లబ్లో రాబిన్ ఊతప్ప, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, ఇయాన్ మోర్గాన్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ మోరిస్, కైలీ అబ్బాట్ తదితరులు ఉన్నారు.
స్టార్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్కు దూరం
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. భారత్ నుంచి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 19 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 634 మంది అన్క్యాపడ్ ప్లేయర్లు, కనీసం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వారు 60 మంది, భారత్ తరుపున ఆడిన వారు 196 మంది, ఆడని వారు 60 మంది ఉన్నారు.