స్లో ఓవర్ రేట్ కొంప ముంచుతుందా?
ఆ తప్పే- స్లోఓవర్ రేట్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. తొలుత ఫీల్డింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్లో స్లో ఓవర్ రేట్ రికార్డయింది. ఇది ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మినిమం ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని ఉల్లంఘించినందుకు కేప్టెన్ విరాట్ కోహ్లీని బాధ్యుడిగా నిలిచారు. 12 లక్షల రూపాయల మేర రెమ్యునరేషన్లో కోత విధించారు.
రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైతే ఏం చేస్తారు?
రెండోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే.. ఈ జరిమానా రెట్టింపు అవుతుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. రెండోసారి స్లో ఓవర్ రేట్ను నమోదు చేసిన జట్టు కేప్టెన్పై 24 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా- ఆ టీమ్లోని ప్రతి క్రికెటర్కూ దీన్ని వర్తింపజేస్తారు. అంటే.. ప్రతి క్రికెటర్ కూడా ఆరు లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది తక్కువ మొత్తం అయితే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మొత్తాన్ని కోత పెడతారు.
మూడో సారి పెనాల్టీ మాత్రం తీవ్రంగా..
మూడోసారి కూడా అదే తప్పు జరిగితే.. దాని మూల్యం తీవ్రంగా ఉంటుంది. జట్టు కేప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధాన్ని విధిస్తారు. అతను ఆడే తదుపరి మ్యాచ్ నుంచి తప్పిస్తారు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో.. ఆ మాటకొస్తే రెండో మ్యాచ్లోనే స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం రాజస్థాన్ రాయల్స్కు ఒకరకంగా ఇబ్బందులకు గురి చేసేదే. ఇంకో రెండు మ్యాచ్లల్లో స్లో ఓవర్ రేట్ను రాయల్ ఛాలెంజర్స్ నమోదు చేస్తే.. అంతే సంగతులు. విరాట్ కోహ్లీ నిషేధానికి గురవుతాడు. ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై దారుణ పరాజయాన్ని చవిచూడటం, లడ్డూ లాంటి రెండు క్యాచ్లను జారవిడవటం, బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైన ప్రస్తుత పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ ఆత్మస్థైర్యం అడుగంటింది.