For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: సెప్టెంబర్‌ 26 కాదు.. అంతకుముందే ఐపీఎల్‌ ఆరంభం!!

IPL 2020 Could Begin on September 19: Report
IPL 2020 Begin On September 19, Matches At 7.30 PM : Reports || Oneindia Telugu

ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో.. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది. ఇక యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వ అనుమతి రాగానే.. లీగ్ షెడ్యూల్‌తో సహా అన్ని విషయాలపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

స్టార్‌ ఇండియా అసంతృప్తి:

స్టార్‌ ఇండియా అసంతృప్తి:

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌పై ప్రసారదారు స్టార్‌ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్‌ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు మ్యాచ్‌ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

 సెప్టెంబర్‌ 19 నుండే:

సెప్టెంబర్‌ 19 నుండే:

స్టార్‌ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్‌ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్‌ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట. ఒకవేళ ఐపీఎల్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభిస్తే.. సాయంత్రం మ్యాచ్‌లను తగ్గించే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులుగా 7.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. దీపావళి (నవంబర్‌ 14) వరకు టోర్నీని పొడిగిస్తే వీక్షణలు పెరగడంతో పాటు ప్రకటనల ధర కూడా అధికంగా ఉంటుందని స్టార్‌ ఇండియా భావిస్తోంది.

 క్రికెటర్లకి క్యాంప్:

క్రికెటర్లకి క్యాంప్:

ఒకవేళ నవంబరు 15 వరకూ ఐపీఎల్ 2020 జరిగితే.. డిసెంబరు 3న ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు భారత ఆటగాళ్లకు చాలా తక్కువ సమయం ఉంటుంది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌కి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వగానే.. క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్‌‌ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా వచ్చే వారం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఐపీఎల్‌ 2020 తుది షెడ్యూల్‌, వేదిక తదితర అంశాలపై ఆ సమావేశం తర్వాత స్పష్టత రానుంది.

 యూఏఈలో ఐపీఎల్‌-7:

యూఏఈలో ఐపీఎల్‌-7:

ఐపీఎల్ 2020 లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ చీఫ్‌ సల్మాన్‌ హనీఫ్‌ స్పందించాడు. 'ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వ‌హించాల‌నుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఐసీసీ అకాడ‌మీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒక‌వేళ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వ‌హించినా ఎటువంటి న‌ష్టం ఉండ‌దు' అని అన్నారు. ఒక్క ఏడాది ఐపీఎల్‌ నిర్వహించకపోతే దాదాపు 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో 2014లో ఐపీఎల్‌-7ను నిర్వహించిన విషయం తెలిసిందే.

వీడ్కోలు ఇంకాస్త బాగుండాల్సింది.. అయినా ఫర్వాలేదు: భారత దిగ్గజం

Story first published: Wednesday, July 22, 2020, 16:11 [IST]
Other articles published on Jul 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+