For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసిన చెన్నై, ఎవరెవరంటే!

IPL 2020 : The Complete List Of Players Chennai Super Kings Released And Retained || Oneindia Telugu
IPL 2020: Chennai Super Kings release 5 players: Who are released, retained, purse available for IPL auction

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.

దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి.

తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.

ఆటగాళ్లను వేలానికి విడుదల చేసిన తర్వాత చెన్నై జట్టులో అత్యధికంగా 20 మంది ఆటగాళ్లున్నారు. మొత్తం 26 మందిలో ఆ జట్టు ఆరుగురిని విడుదల చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ లంక పేసర్ లసిత్ మలింగ సహా 18 మందిని అట్టి పెట్టుకోవడం విశేషం.

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు

మోహిత్‌ శర్మ, శామ్‌ బిల్లింగ్స్‌, డేవిడ్‌ విల్లే, స్కాట్‌ కుగిలీన్‌, ధ్రువ్‌ షోరె, చైతన్య బిష్ణోయి

విడదల చేయడానికి కారణం

విడదల చేయడానికి కారణం

శామ్‌ బిల్లింగ్స్ మరియు డేవిడ్ విల్లీ, ఇంగ్లాండ్ ద్వయం ఐపిఎల్ 2019 కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన విల్లీ కూడా చెన్నై తరుఫున చోటు దక్కించుకోలేకపోయాడు. భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ కొంతకాలంగా గాయాలతో కొంత ఇబ్బంది పడుతుండటంతో చెన్నై విడుదల చేసింది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు

ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రావో, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్‌ శాంట్నర్‌, మోను కుమార్‌, ఎన్‌ జగదీశన్‌, హర్భజన్‌సింగ్‌, కర్ణ్‌శర్మ, ఇమ్రాన్‌ తాహిర్‌, దీపక్‌ చాహర్‌, కేఎం ఆసిఫ్‌

మిగిలిన నగదు

మిగిలిన నగదు

ఐపీఎల్ 2019 వేలం తర్వాత చెన్నై వారి పర్సులో రూ .3.2 కోట్లు మిగిలి ఉన్నాయి. ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా సూపర్ కింగ్స్ రూ .8.4 కోట్లు సంపాదించింది. బిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. వచ్చే నెలలో జరిగే ఐపిఎల్ 2020 వేలంలో వారు రూ .14.6 కోట్లు ఖర్చు చేయవచ్చు.

Story first published: Saturday, November 16, 2019, 8:24 [IST]
Other articles published on Nov 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+