అలవోకగా సిక్సర్లు బాదే ధనాధన్ బ్యాట్స్మెన్.. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే దిగ్గజ ఆటగాళ్లు సొంతమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న ఈ జట్టు 2016 సీజన్లో ఫైనల్ మెట్టున సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ అందుకోవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతుంది. ఇటీవల కొత్త లోగో, జెర్సీని ఆవిష్కరించిన ఆర్సీబీ ఫ్రాంఛైజీ.. వేలంలో అత్యుత్తమ ఆటగాళ్లను చేజిక్కించుకొని తమ అభిమానుల్లో అంచనాలను పెంచింది. ఈ జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.