For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గెలిచే మ్యాచ్‌ ఎలా ఓడిపోవాలో పంజాబ్‌ చూపించింది.. రాహుల్‌ టీమ్‌ ఆడిన తీరు ఊహకు కూడా అందలేదు'

IPL 2020: Aakash Chopra opined that the Kings XI Punjab lost a match they should have won easily

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రాత ఏమాత్రం మారట్లేదు. గెలిచే మ్యాచ్‌లను కూడా చేజేతులారా పోగొట్టుకుంటోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ ఆకాశ్ ‌చోప్రా స్పదించాడు. గెలిచే మ్యాచ్‌ను ఎలా ఓడిపోవాలో పంజాబ్‌ చూపించిందని, అది తనను షాక్‌కు గురిచేసిందని ఆకాశ్‌ అన్నాడు.

ఊహకు కూడా అందలేదు:

ఊహకు కూడా అందలేదు:

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ మ్యాచ్‌పై ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్లో విశ్లేషించాడు. 'రాహుల్‌ టీమ్‌ కోల్‌కతాను ఓ మోస్తారు స్కోరుకే పరిమితం చేసింది. అది ఛేదించదగిన స్కోర్. అలానే పంజాబ్‌ ఆడిన తీరు ఊహకు కూడా అందలేదు. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించాక విజయం వైపు నడవాలి. మయాంక్ ‌(56) ఔటయ్యాక చివరి 5 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి' అని చెప్పాడు.

అనుభవజ్ఞులను పంపలేదు:

అనుభవజ్ఞులను పంపలేదు:

'ధాటిగా ఆడే క్రమంలో నికోలస్‌ పూరన్ ‌(16) ఔటైనా పంజాబ్‌ గెలవడానికి అప్పటికీ అవకాశాలున్నాయి. అయితే ఇక్కడే ఆ జట్టు తీరు నన్ను ఆశ్చర్యం కలిగించింది. పూరన్‌ పెవిలియన్‌ చేరాక అనుభవం లేని ప్రభు సిమ్రన్‌ను బరిలోకి దింపారు. మన్‌దీప్, మాక్స్‌వెల్‌ లాంటి అనుభవజ్ఞులను పంపలేదు. ప్రభు సిమ్రన్‌ కుదురుకునేలోపే రన్‌రేట్‌ ఆమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలోనూ పంజాబ్‌ ఓడిపోదు. అయినా ఆ జట్టు ఓటమిపాలైంది. చాలా నిరాశ చెందా' అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. పంజాబ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క విజమే సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్‌లు మెరుగైన రన్‌రేట్‌తో విజయాలు సాధించాలి.

మహీ ఎలా ముందుకు వెళతారు:

మహీ ఎలా ముందుకు వెళతారు:

ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చాలా కష్టపడాల్సి ఉందని ఆకాశ్‌ చోప్రా చెప్పాడు. 'మహీ ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళతారు.. చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇప్పటికే సగం సీజన్‌ పూర్తి అయినందున చెన్నై మెరుగవుతుందని ఆశించాము. ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే గెలుపొందడంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కాల్సి ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తే అక్కడ చోటు దక్కుతుంది. ఒకవేళ 5 గెలిచినా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై ఆ 5 విజయాలు సాధిస్తుందా అనేదే అసలైన ప్రశ్న' అని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. చెన్నై ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే సాధించి ఆరో స్థానంలో నిలిచింది.

MI vs DC: డికాక్‌, సూర్యకుమార్‌ మెరుపు హాఫ్ సెంచరీలు.. ఢిల్లీపై ముంబై విజయం!!

Story first published: Monday, October 12, 2020, 7:36 [IST]
Other articles published on Oct 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+