|
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో
ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం యువీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో విలేకరులు అతడి రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్న వేశారు. ఆటపై ఇష్టం ఉన్నంత కాలం తాను క్రికెట్ ఆడుతానని యువరాజ్ సమాధానమిచ్చాడు.
|
రిటైర్మెంట్పై మాట్లాడిన యువీ
యువీ మాట్లాడుతూ "రిటైర్ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందుగా నేను ఆ పని చేస్తా. గత రెండేళ్లుగా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఒక దశలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు" అని అన్నాడు.
క్రికెట్ను ఎంతగా ఆస్వాదించానో
"నేను అండర్-16 ఆడేటప్పుడు క్రికెట్ను ఎంతగా ఆస్వాదించానో ఇప్పుడూ అలాగే ఉన్నాననిపించింది. అప్పటికీ నాకు జాతీయ జట్టులో అవకాశం రాలేదు. కానీ, ఆ సమయంలో ఆటను ఆస్వాదించాను కాబట్టి ఆడాను. కాబట్టి ఇప్పుడు కూడా ఆటను ఆస్వాదించినంత కాలం ఆడతా" అని యువరాజ్ స్పష్టం చేశాడు.
|
రిటైర్మెంట్ విషయంపై సచిన్తో మాట్లాడా
తన రిటైర్మెంట్ విషయంపై క్రికెట్ దిగ్గజం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో మాట్లాడానని చెప్పాడు. తన వయసులోనే ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడని యువరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. సచిన్తో మాట్లాడిన తర్వాత తనలో ఆందోళన తగ్గిందని కూడా యువరాజ్ వెల్లడించాడు.
గత సీజన్లో యువరాజ్ పేలవ ప్రదర్శన
కాగా గత ఐపీఎల్ సీజన్లో యువరాజ్ ఆశించినంత స్థాయిలో రాణించలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మొదట అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండోసారి వేలంలో చివరికి ముంబై ఇండియన్స్ జట్టు అతడిని కనీస ధరకే కొనుగోలు చేసింది. దీంతో యువీ ఆడిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు.