బీసీసీఐ ట్విట్టర్లో ఐపీఎల్ షెడ్యూల్
ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్లో ఐపీఎల్ షెడ్యూల్ని ఉంచింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను ఐపీఎల్ ట్విటర్లో ఉంచారు.
|
మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల తర్వాత
మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను మార్చి 24న కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 29న రాజస్థాన్ vs సన్రైజర్స్ మ్యాచ్తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది.
14 రోజుల షెడ్యూల్లో మొత్తం 17 మ్యాచ్లు
తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలోని ఎనిమిది జట్లూ నాలుగేసి మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్లు సొంతగడ్డపై మిగిలిన రెండు ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. కాగా బెంగళూరు, ఢిల్లీ జట్లు మాత్రం ఐదేసి మ్యాచ్లు ఆడనుండగా సొంతగడ్డపైనే మూడు మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ని విడుదల చేశారు.