సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
మార్చి 13 తర్వాత జింబాబ్వేతో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాలని బీసీసీఐ తొలుత షెడ్యూల్ని రూపొందింది. అయితే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్ని రెండు వారాలు ముందుకు జరిపి మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవలే బీసీసీఐ పాలకుల కమిటీ అధికారిక ప్రకటన చేసింది.
కేవలం 10 రోజుల వ్యవధే ఉండటంతో
దీంతో ఆసీస్ పర్యటనకు ఐపీఎల్ 2019 సీజన్కు మధ్య కేవలం 10 రోజుల వ్యవధే ఉండటంతో జింబాబ్వేతో సిరీస్ ఆడటం కష్టం కానుండటంతో ఆ పర్యటనని రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే, ఇందుకు జింబాబ్వే బోర్డు అంగీకరించకపోవడంతో ఒక వన్డే, ఒక టీ20తో జింబాబ్వే పర్యటనని సరిపెట్టాలని కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
2002లో చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ ఆడిన జింబాబ్వే
భారత్ గడ్డపై 2002లో చివరిసారి జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత 2016లో టీ20 వరల్డ్కప్ కోసం భారత్కి వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరిస్ ఆడుతోంది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మంగళవారం ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరగనుంది.