
పూర్తి స్థాయిలో ఓపెనర్గా ఆడతా
అయితే, శనివారం నుంచి ప్రారంభంకానున్న సీజన్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓపెనర్గా ఆడతానని రోహిత్ శర్మ ఇటీవలే ప్రకటించాడు. "ఐపీఎల్ 2019 సీజన్లో నేను ఆడే అన్ని మ్యాచ్ల్లోనూ ఓపెనర్గా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీ తర్వాత ప్రపంచకప్ జరగనుండటం కూడా దీనికి ఓ కారణం. అంతేకాకుండా.. నేను ఓపెనర్గా అత్యుత్తమ ప్రదర్శన చేయగలుగుతున్నా" అని అన్నాడు.

రోహిత్ ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది
"ఈ విషయాన్ని ఇప్పటికే జట్టుతో చర్చించాను. వారు అర్థం చేసుకున్నారు. జట్టు మిడిలార్డర్లో అనుభమున్న ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి.. ఫ్రాంఛైజీ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది" అని రోహిత్ అన్నాడు. రోహిత్ శర్మ నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "ముంబై ఇండియన్స్ జట్టు గత మూడు సీజన్లుగా రోహిత్ శర్మ ఓపెనింగ్ నిర్ణయాలతో ఇబ్బంది పడుతోంది" అని అన్నాడు.

రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్
"నేను ఆ జట్టుతో పనిచేసే సమయంలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అది అతను తీసుకున్న నిర్ణయమే. కానీ.. ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం అతను ఓపెనర్గా ఆడాలని కోరుకునేది. 2018 ఐపీఎల్ సీజన్లోనూ ఇలానే జరిగింది. అతను ఓపెనర్గా ఆడతానని చెప్పి.. రెండు మ్యాచ్లు ఆడాడు" అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

మళ్లీ మిడిలార్డర్కి మారిపోయాడు
"అయితే, ఫెయిలవడంతో.. మళ్లీ మిడిలార్డర్కి మారిపోయాడు. ఈ ఏడాది ఫెయిలైనా.. అతను నిర్ణయం మార్చుకోడని గ్యారంటీ లేదు. కాబట్టి.. అతను తాజా సీజన్లోనైనా ఓ నిర్ణయానికి కట్టుబడి ఆడితే మంచిది" అని అనిల్ కుంబ్లే తెలిపాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభంకానుండగా.. 24న ఢిల్లీ క్యాపిటల్స్తో వాంఖడే వేదికగా ముంబై వేదికగా తన తొలి మ్యాచ్లో తలపడనుంది.


Click it and Unblock the Notifications
