ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేసర్ ఇశాంత్ శర్మ వేసిన 2వ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ రహానే (2) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇశాంత్ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి లివింగ్స్టోన్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అక్షర్ వేసిన ఐదో ఓవర్లో సంజూ శాంసన్ (5) రనౌట్ అయ్యాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్.