సన్రైజర్స్ నిష్క్రమణ
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుండగా... ఓటమితో సన్రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టిక, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్లను ఎవరు సొంతం చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం...
వార్నర్దే ఆరెంజ్ క్యాప్
వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ సొంతదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లినప్పటికీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఆటగాడిగా అతడే కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ మొత్తం 12 ఇన్నింగ్స్లాడి 692 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (14 ఇన్నింగ్స్ల్లో 593) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
కగిసో రబాడ
గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో రబాడ 12 ఇన్నింగ్స్ల్లో 25 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానంలో 23 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ 20 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.