ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహా యజమాని నెస్ వాదియాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. జపాన్లో డ్రగ్స్తో పట్టుబడిన కేసులో అతనికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు అయింది. నెస్ వాదియా ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తుపదార్ధాలతో జపాన్లో పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చిలో హకోయిడో ద్వీపంలోని న్యూ ఛిటోస్ విమానాశ్రయంలో నెస్ వాదియా 25 గ్రాముల మత్తుపదార్ధాలతో పట్టుబడ్డాడు. 'తాను కేవలం వ్యక్తిగత వాడకం కోసమే మత్తుపదార్ధాలను తెచుకున్నానని' అరెస్ట్ అయిన సందర్భంలో నెస్ వాదియా తెలిపాడు. అరెస్ట్ అయిన అనంతరం వాదియా కోర్టుకు హాజరయ్యాడు. తాజాగా కోర్ట్ వాదియాకు రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
నెస్ వాదియా 'వాదియా గ్రూప్' అధినేత నుస్లీ వాదియా వారసుడు. నెస్ వాదియా జైలు శిక్షపై వాదియా గ్రూప్ ఇప్పటి వరకూ స్పందించలేదు. 2014లో ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహా యజమాని, బాలీవుడ్ నటి ప్రీజి జింటా.. నెస్ వాదియాపై వేధింపుల కేసు పెట్టింది. అనంతరం ఈ కేసును ప్రీజి జింటా వెనక్కి తీసుకుంది.