ఐపీఎల్ ఓ ఫన్నీ టోర్నమెంట్:
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ఇది జట్టు ఫలితం. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఒక్క ఆటగాడిపైనే ఆధారపడలేదు. అందరూ కూడా తమ వంతు కృషి చేసి విజయాలు అందించారు. ఈ రోజు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ బిజినెస్ గురించి, దాని విషయాలు తెలుసు. ఫ్రాంచైంజీలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే మనం కష్టపడాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఓ ఫన్నీ టోర్నమెంట్. ఇందులో ఏ జట్టు దేనినైనా ఓడించవచ్చు. మా ప్రయాణం బాగున్నా మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి' అని రోహిత్ పేర్కొన్నారు.
కూతురికి అంకితం:
'ఇక్కడ మ్యాచ్ జరిగిన ప్రతిసారీ నా కూతురు సమైరా.. నా ఆటను చూడటానికి వస్తుంది. ఈ రోజు కూడా వచ్చింది. ఆరంభంలో నేను పరుగులు చేయలేదు. కానీ ఈ రోజు అర్ధ శతకం సాధించాను. అయితే ఆలోపే తను నిద్రపోయింది. ఈ అర్ధశతకం తనకి అంకితమిస్తున్నా' అని రోహిత్ తెలిపారు.
కోల్కతా ఓటమి:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు), సూర్య కుమార్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగారు.