ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్?:
అయితే ప్రపంచకప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అదలావుంటే.. వచ్చే సంవత్సరం ధోనీ 38వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్గా వ్యవరిస్తాడా లేదా అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై చెన్నై వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్పందించారు.
రిటైర్మెంట్ సంకేతాలు ఇవ్వలేదు:
'ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే, అతనెంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాడు. చెన్నైకి కెప్టెన్గా కూడా ఉంటాడు. అతను ఓ గొప్ప ఆటగాడు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా, వికెట్కీపర్గా ధోనీ సేవలు అద్భుతం' అని రైనా పేర్కొన్నారు.
ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపించింది:
'ధోనీ లేనప్పుడు చెన్నై జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టడం సంతోషకరమైన విషయం. టీమిండియా, గుజరాత్ లయన్స్ జట్లకు కూడా కెప్టెన్గా చేశాను. నా సారథ్యంలో మంచి విజయాలు సాధించాం. ధోనీ లేకపోవడం వల్ల చెన్నైకి కెప్టెన్గా కన్నా.. ఓ బ్యాట్స్మన్గా కోల్పోవడమే ఎక్కువ నష్టం. సన్రైజర్స్, ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అదే నిరూపితమైంది. ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ధోనీ ఆడేటప్పుడు ఇతర ఆటగాళ్లకి స్వేచ్ఛనిస్తాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు ఒత్తిడి ఉంటుంది' అని రైనా చెప్పుకొచ్చారు.