ఐపీఎల్ సీజన్-12లో కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సొంత చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 150 వికెట్లు తీసిన బౌలర్గా పీయూష్ చావ్లా చరిత్ర సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పీయూష్ చావ్లా 150వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ముంబై ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతిని చావ్లా వేయగా.. ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్తా గాల్లోకి లేచి చావ్లా చేతిలో పడింది. దీంతో చావ్లా ఖాతాలో 150వ వికెట్ చేరింది. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ, భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా తర్వాత ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన బౌలర్గా అరుదై ఘనత సాధించాడు. మ్యాచ్లో చావ్లా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసాడు.
ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 232 పరుగులు చేసింది. రసెల్ (80 నాటౌట్; 40 బంతుల్లో 6×4, 8×6) , శుభ్మన్ గిల్ (76; 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్ లిన్ (54; 29 బంతుల్లో 8×4, 2×6) రెచ్చిపోయారు. అనంతరం 233 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓడిపోయింది. హార్దిక్ (91; 34 బంతుల్లో 6×4, 9×6) పెను విధ్వంసం సృష్టించాడు.