హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని సామాన్యుల్ సైతం సెలబ్రిటీలుగా మారుతున్నారు. మొన్న ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ దీపికా ఘోష్... నేడు అదితి హుందియా. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా గత ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ పైనల్ మ్యాచ్ జరిగింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ జరగుతున్న సమయంలో ఓ అమ్మడు చిరునవ్వులు చిందిస్తూ ఒక్కసారిగా మెరిసింది. ఆ అమ్మాయిని టీవి తెరపై చూసిన నెటిజన్లు ఆమె ఎవరో తెలుసుకోవాలని ఇంటర్నెట్ మొత్తం వెతికారు.
చివరకు ఆమె ఆచూకీ పట్టేశారు. ఆ అమ్మడు పేరు అదితి హుందియా. 2018లో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్ గెలుపొందింది. అంతేకాదు పొలాండ్ వేదికగా జరిగిన అందాల పోటీల్లో సైతం భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించింది. 2017లో ఫెమినా మిస్ ఇండియా జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.
View this post on InstagramThrowback 🥀🌝 @missdivaorg @misssupranational
A post shared by Aditi Hundia (@aditihundia) on
దీంతో పాటు కలర్స్ ఫెమినా ఇండియా రాజస్థాన్ టైటిల్ను కూడా గెలుపొందింది. అదితికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే చచ్చేంత ప్రేమ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్కు చేరడంతో ఈ మ్యాచ్కు హాజరైంది.
దీంతో మ్యాచ్ మధ్యలో ఆమె స్టేడియంలోని స్క్రీన్లపై ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయింది. కాగా, ఐపీఎల్ లీగ్ స్టేజిలో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దీపికా ఘోష్ అనే అమ్మాయి కూడా ఇలాగే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే.
View this post on InstagramA post shared by Aditi Hundia (@aditihundia) on