
వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిన ఆర్సీబీ
సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోయింది. అంతేకాదు ఐపీఎల్లో 100 ఓటములను ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆర్సీబీ పరువు దక్కించుకోవాలని చూస్తుండగా... రాజస్థాన్ మాత్రం గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.

ఆర్సీబీ కీలక ఆటగాళ్లు వీరే
ఆర్సీబీలో కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. అయితే, కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. బ్యాట్స్మెన్గా కూడా అతడి ఆట అభిమానులను నిరాశపరుస్తోంది. ఈ మ్యాచ్లో కోహ్లీ, డివిలియర్స్ విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఆర్సీబీ ప్రధాన బౌలర్గా కొనసాగుతున్న చాహల్ సైతం ఈ సీజన్లో ఇప్పటివరకు 16 వికెట్లు మాత్రమే తీశాడు. 8కి పైగా ఎకానమీతో పరుగులు ధారాళంగా సమర్పించుకున్న సందర్భాలు అనేకం.

రాజస్థాన్లో కీలక ఆటగాళ్లు వీరే
ఈ సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహారించాడు. అయితే, స్టీవ్ స్మిత్కు ఎప్పుడైతే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో ఆ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. కెప్టెన్గా స్టీవ్ స్మిత్ యావరేజి 44.3 కాగా, స్ట్రయిక్ రేట్ 130గా ఉంది. ఈ సీజన్లో స్టీవ్ స్మిత్కు బహుశా ఇదే ఆఖరి మ్యాచ్ కావొచ్చు. ఈ మ్యాచ్ అనంతరం వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. మరోవైపు ఈ సీజన్ మాత్రం శ్రేయాస్ గోపాల్కు డ్రీమ్ సీజన్.

నేటి మ్యాచ్లో విజయమెవరిది?
ఈ సీజన్లో ఇరు జట్లు నిలకడలేమి ప్రదర్శనను కొనసాగించాయి. అయితే, ఆర్సీబీతో పోలిస్తే రాజస్థాన్ కొంత మేరకు ఫరవాలేదు. ఆర్సీబీ సొంత గడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల మద్దతు ఆ జట్టుకే ఉంటుంది. మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించింది. ఈ ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్ బరిలోకి దిగనుంది. రాజస్థాన్ లేదా ఆర్సీబీ ఏ జట్టు గెలిచినా... ప్లేఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది.


Click it and Unblock the Notifications
