హైదరాబాద్: మొహాలి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 52 (3 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 38 పరుగుల వద్ద క్రిస్ గేల్ 22 బంతుల్లో 30 (2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 16, 2019
Half-century from Rahul and a well made 40 from Miller guide #KXIP to a formidable total of 182/6. Will the @rajasthanroyals chase this down?#KXIPvRR pic.twitter.com/8qemG6UM4u
ఈ క్రమంలో జట్టు స్కోరు 67 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ 12 బంతుల్లో 26(ఫోర్, 2 సిక్సర్లు) భారీ షాట్కు యత్నించి ఇష్ సోథీ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కి క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 40(2 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి కేఎల్ రాహుల్ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు.
వీరిద్దరూ 85 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 52(3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పురాన్(5) నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ 19వ ఓవర్లో 3 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
Two wickets in the 19th over for @craig_arch.#KXIP 164/5 https://t.co/O1uhwq8RWc pic.twitter.com/89DF9Bebqo
— IndianPremierLeague (@IPL) April 16, 2019
అయితే, చివర్లో అశ్విన్ 4 బంతుల్లో 17 నాటౌట్ (ఫోర్, 2 సిక్సర్లు) చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదడంతో పంజాబ్ 182 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శామ్ కర్రన్ స్థానంలో డేవిడ్ మిల్లర్ని తుది జట్టులోకి తీసుకోగా... ఈ మ్యాచ్తో హర్షదీప్ సింగ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్కు చేరాలంటే ఇకపై జరిగే మ్యాచుల్లోనూ తప్పక గెలవాలి.
The @rajasthanroyals win the toss and elect to bowl first against the @lionsdenkxip #KXIPvRR pic.twitter.com/LV9Bf0YkFX
— IndianPremierLeague (@IPL) April 16, 2019
ఇక, రాజస్థాన్ మాత్రం జట్టులో మూడు మార్పులు చేసింది. టర్నర్, స్టువర్ట్ బిన్ని, ఇష్ సోదీలకు రాజస్థాన్ జట్టులో చోటు కల్పించింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. కాగా, ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్లో జోస్ బట్లర్ను అశ్విన్ మన్కడింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Arshdeep Singh and Moises Henriques all set to make their debit for the @lionsdenkxip tonight.#KXIPvRR pic.twitter.com/qu4kwZXPXY
— IndianPremierLeague (@IPL) April 16, 2019
జట్ల వివరాలు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, అశ్విన్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, హర్షదీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్
రహానే, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, ఆస్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి, ఇష్ సోధీ
A look at the Playing XI for the two teams #KXIPvRR pic.twitter.com/C3bNZWBxXK
— IndianPremierLeague (@IPL) April 16, 2019