
మొహాలి వేదికగా కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు పంజాబ్ రెండు మార్పులు చేసింది. మిల్లర్, ముజీబ్ స్థానాల్లో సామ్ కర్రన్, టైలు జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్కతా ఎలాంటి మార్పులు చేయలేదు.
పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ప్రస్తుతం పంజాబ్, కోల్కతాలు 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు జట్లకు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇరు జట్లు మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
జట్లు:
కోల్కతా నైట్రైడర్స్:
క్రిస్ లిన్, సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, రింకు సింగ్, గుర్నే, సందీప్ వార్రియర్ .
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రన్, సిమ్రాన్ సింగ్, మురుగన్ అశ్విన్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, టై.