హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్లో ఈ రెండు జట్లు 9 మ్యాచ్లాడి చెరో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ఢిల్లీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కోలిన్ ఇంగ్రామ్, లమిచానే, రూథర్ఫర్డ్లకు తుది జట్టులో చోటు కల్పించారు.
In other news, the @DelhiCapitals win the toss and elect to bowl first against the @lionsdenkxip.#DCvKXIP pic.twitter.com/ALDfYFhQAp
— IndianPremierLeague (@IPL) April 20, 2019
మరోవైపు పంజాబ్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. మిస్టరీ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ను జట్టులోకి తీసుకుంది.
జట్ల వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్ప్రీత్ బ్రార్, హర్డుస్ విజయిన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ,
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇన్గ్రామ్, రూథర్ఫర్డ్, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, సందీప్ లమిచానే