

హైదరాబాద్: మొహాలి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై పంజాబ్కు ఇది రెండో విజయం కావడం విశేషం. పంజాబ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆఖరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 15 పరుగులు అవసరమ్యాయి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో ఆఖరి ఓవర్ వేసిన శామ్ కుర్రన్ వరుసగా రెండు బంతుల్లో కగిసో రబడ, సందీప్ లామిఛానేలను పెవిలియన్కు చేర్చాడు. తొలి బంతిని యార్కర్గా సంధించగా రబాడ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాతి బంతికి లమిచానే కూడా బౌల్డయ్యాడు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పంజాబ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన కేఎల్ రాహుల్(15) అదే ఓవర్ ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు.
వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కి 62 పరుగులు జోడించారు. అయితే, దూకుడుగా ఆడుతోన్న ఈ జోడీని సందీప్ విడగొట్టాడు. సందీప్ వేసిన 14వ ఓవర్ ఐదో బంతికి సర్ఫరాజ్(39) పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం చేయడంతో కింగ్స్ తేరుకుంది.
ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మన్దీప్ సింగ్(29 నాటౌట్) కలిసి మిల్లర్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే క్రిస్ మోరిస్ వేసిన 17వ ఓవర్ రెండో బంతికి మిల్లర్(43) భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు, లమిచానే, రబాడలు తలో రెండు వికెట్లు తీశారు.