హైదరాబాద్: మొహాలి వేదికగా జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ 55 బంతుల్లో 96 (10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో పంజాబ్కు 171 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై ఆరంభంలోనే షేన్ వాట్సన్(7) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. వీరిద్దరూ 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్గా ఔటయ్యాడు.
Shami's 2 final over wickets helped restrict @ChennaiIPL to 170/5 after @faf1307 timed a sweet and watchable 96 🙌#KXIPvCSK pic.twitter.com/lFQgVUBvB2
— IndianPremierLeague (@IPL) May 5, 2019
38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 150 పరుగుల వద్ద శామ్ కర్రన్ బౌలింగ్లో షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత డుప్లెసిస్ దూకుడుగా ఆడిన డుప్లెసిస్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు.
అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్, శామ్ కర్రన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఐపీఎల్లో డుప్లెసిస్కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని (10 నాటౌట్) చేయడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కర్రాన్ మూడు వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు తీశాడు.
Faf du Plessis is our key performer for the @ChennaiIPL innings.
— IndianPremierLeague (@IPL) May 5, 2019
Will his innings turn into a match-winning inning?#KXIPvCSK pic.twitter.com/ykjS4gZ7vy
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
అంతకముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. అక్షదీప్సింగ్ స్థానంలో హర్ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ చెప్పాడు.
#KXIP win the toss and elect to bowl first against #CSK pic.twitter.com/Iuy5Zd4uEn
— IndianPremierLeague (@IPL) May 5, 2019
రెండు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబై జట్లు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరగా.. చివరి స్థానం ఎవరిదో ఆదివారం నాటి మ్యాచ్లతో తేలనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తమ విజయాల సంఖ్యను పెంచుకోవాలని చెన్నై చూస్తుండగా, గెలిచి గౌరవంగా నిష్క్రమించాలని పంజాబ్ భావిస్తోంది. ఇక చివరి ప్లేఆఫ్స్ బెర్తు కోసం కోల్కతా, హైదరాబాద్, పంజాబ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
— IndianPremierLeague (@IPL) May 5, 2019
ఇప్పటికే బెంగళూరు, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. కాగా, ప్లేఆఫ్స్ చేరిన మూడు జట్లకు, చివరి బెర్తుకు పోటీలో ఉన్న మూడు జట్లకు ఆదివారం నాటి మ్యాచ్ ఫలితాలు కీలకం కానున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 10 పాయింట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో పంజాబ్ విజయం సాధించడం అత్యంత కీలకం.
జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), మన్దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై