తొలి వికెట్కు 108 పరుగులు
వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 108 పరుగులు జోడించి కింగ్స్ పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే, ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్లో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్రేట్ (-0.251)తక్కువగా ఉండటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పాయింట్ల పట్టిక ఆరోస్థానానికి పరిమితమైంది.
ప్లేఆఫ్కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయిన పంజాబ్
దీంతో ప్లేఆఫ్కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మాట్లాడుతూ "ఈ సీజన్లో విజయవంతమైన ప్రాంఛైజీలను గమనిస్తే అవన్నీ కూడా కీలక ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. ఎవరైతే ఆటగాళ్లు మంచి శుభారాన్నిచ్చి జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తారో అలాంటి వారే జట్టుకు కావాలి" అని అన్నాడు.
|
డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి
"వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఆ మరుసటి రోజు నుంచే రాణించాలని అనుకోవడం సరైంది కాదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి అలవాటు పడేలా చేయడం ఎంతో ముఖ్యం. ఈ సీజన్లో మేమింకా అత్యంత నాణ్యంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదో ప్రత్యేకంగా చేయాలి. మరి కొంత మంది నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు అవసరం" అని అశ్విన్ తెలిపాడు.
ప్లేఆఫ్స్కు చేరుకోనందుకు బాధగా
"అయితే, ఈ సీజన్లో చివరి మ్యాచ్ను ఘనంగా ముగించినందుకు సంతోషంగా ఉంది. ప్లేఆఫ్స్కు చేరుకోనందుకు బాధగా కూడా ఉంది. వచ్చే ఏడాది మరింత వినోదాన్ని అభిమానులకు పంచడానికి ప్రయత్నిస్తాం" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది.