స్టాండ్స్ వివాదం:
నిజానికి.. ఐపీఎల్ సీజన్-11 విజేతగా సూపర్ కింగ్స్ నిలవడంతో చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో గత 7 సంవత్సరాలుగా స్టాండ్స్ వివాదం కొనసాగుతోంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మధ్య గొడవ కారణంగా.. చిదంబరం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా మూడు స్టాండ్లు ఖాళీగానే ఉంటున్నాయి.
వారం గడువు:
సోమవారం సీఓఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్టాండ్స్ వివాదం పరిష్కరించుకునేందుకు అసోసియేషన్కు వారం రోజులు గడువిచ్చింది. ఈ వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపొతే హైదరాబాద్లోనే ఫైనల్ నిర్వహిస్తాం అని సీఓఏ తేల్చేసింది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు అధికారులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్, ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరిగింది.
ప్లే ఆఫ్ మ్యాచ్లు బెంగళూరులో:
బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... 'చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్లు అంటే 12 వేల మంది ప్రేక్షకులు లేకపోతే మైదానం ఖాళీగా ఉంటుంది. ఇది ఫైనల్ మ్యాచ్కు అంత మంచిది కాదు. ప్లే ఆఫ్కు వెళితే సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోకూడదు. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురాకపోతే మాత్రం 2018 రన్నరప్ హైదరాబాద్లోనే ఫైనల్ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్ మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయి' అని చెప్పుకొచ్చారు.