నాలుగు సెంచరీలు చేసిన పృథ్వీ షా
శుభమాన్ గిల్ కూడా ఇప్పటివరకు నాలుగు సెంచరీలు సాధించాడు. మొహాలీ వేదికగా గత శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గిల్ (49 బంతుల్లో 65) పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో మూడు హాఫ్ సెంచరీలతో సంజూ శాంసన్(రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్), ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ నాలుగుపైగా హాఫ్ సెంచరీలు
ఐపీఎల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన టీనేజర్స్:
4 - శుభమాన్ గిల్/ పృథ్వీ షా
3 - సంజూ శాంసన్/రిషబ్ పంత్/ ఇషాన్ కిషన్
1- గోస్వామి/ మనీష్ పాండే/ దీపక్ హుడా/ రేయాన్ పరాగ్

162 పరుగులు చేసిన సన్రైజర్స్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది.

టోర్నీ నుంచి సన్రైజర్స్ నిష్క్రమణ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 56(6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... రిషబ్ పంత్ 21 బంతుల్లో 49(2 ఫోర్లు, 5 సిక్సులు) మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఓటమితో సన్రైజర్స్ టోర్నీ నుంచి తప్పుకోగా.... శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగే క్వాలిఫయిర్ 2 మ్యాచ్లో చెన్నైతో ఢిల్లీ తలపడనుంది.


Click it and Unblock the Notifications
