18 సంవత్సరాల 169 రోజుల్లో
అంతకముందు 18 సంవత్సరాల 169 రోజుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు రేయాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో రేయాన్ పరాగ్ రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
రహానే(2), లివింగ్ స్టోన్(14), సంజూ శాంసన్(5), లామ్రోర్(8), శ్రేయస్ గోపాల్(12), స్టువర్ట్ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్(6), ఇష్ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్థాన్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో వెటరన్ ఇషాంత్శర్మ, అమిత్ మిశ్రా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్
ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, రాజస్థాన్ తరఫున 7 మ్యాచ్లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు చేశాడు. కాగా, అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాళ్లంతా ఈ మ్యాచ్లో ఆడటం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషభ్పంత్, పృథ్వీషా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్, రేయాగ్ పరాగ్లు ఉన్నారు.


Click it and Unblock the Notifications












