|
ధోని హాఫ్ సెంచరీ
అంతకముందు ధోని (75 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు చేజార్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రైనా, ధోనీ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
రైనాతో కలిసి దూకుడుగా ఆడిన ధోని
పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుండటంతో వరుస ఓవర్లలో అంబటి రాయుడు (1), షేన్ వాట్సన్ (13), కేదార్ జాదవ్ (8) ఔటయ్యారు. దీంతో 4.5 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీతో కలిసి సురేశ్ రైనా(36) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే, ఉనద్కత్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.
|
ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు
అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రావోతో కలిసి ధోనీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ధోని హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధోనికి ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2018 ఐపీఎల్లో మొహాలి వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధోని (44 బంతుల్లో 79 నాటౌట్)కి ఐపీఎల్లో అత్యధిక స్కోరు.
చివరి ఓవర్లో మూడు సిక్సులు
చివరి ఓవర్లో ధోనీ మూడు సిక్సులు బాది తనదైన శైలిలో చెన్నై సూపర్ కింగ్స్కి ఫినిషింగ్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్ రెండో బంతిని జడేజా సిక్స్ కొట్టగా, మూడో బంతి వైడ్ అయ్యింది. అటు తర్వాత జడేజా సింగిల్ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లో మొత్తంగా 28 పరుగులు వచ్చాయి. దాంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ రెండు, ధావల్ కులకర్ణి, బెన్ స్టోక్స్, ఉనాద్కత్ తలో వికెట్ తీసుకున్నారు.