ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరిస్తో ఫామ్లోకి
ఇప్పటి వరకూ సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రమే ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేశారు. కాగా, గత సీజన్లో నిరాశపరిచిన క్రిసే గేల్... ఇటీవలే ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరిస్తో ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
క్రిస్గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు
ఇంగ్లాండ్తో ఫిబ్రవరిలో ముగిసిన వన్డే సిరీస్లో 4 మ్యాచ్లాడిన క్రిస్గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, మార్చి 23న చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆటాగాడు సురేశ్ రైనా ఐపీఎల్లో 5000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్లో క్రిస్ గేల్ మెరుగైన రికార్డు
కాగా, ఐపీఎల్లోనూ క్రిస్గేల్కి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 112 మ్యాచ్లాడిన క్రిస్ గేల్ 41.17 సగటుతో 3,994 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండగా.. 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications

