నోబాల్ గొడవ.. ఉమేశ్పై ఆగ్రహం:
ఐపీఎల్ సీజన్-12 లీగ్ మ్యాచ్ల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సన్రైజర్స్ మొదటగా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ను బెంగళూరు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేస్తున్నాడు. ఆ ఓవర్లోని ఓ బంతిని అంపైర్ నిగెల్ లాంగ్ నోబాల్గా ప్రకటించారు. రీప్లేలో అది సరైన డెలివరీ అని తేలడంతో.. ఉమేశ్తో పాటు బెంగళూరు కెప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నోబాల్ ఎలా అవుతుందని ఉమేశ్ ప్రశ్నించగా.. అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేసి బౌలింగ్ వేయడానికి వెళ్లాలని సూచించాడు.
బీసీసీఐకి ఫిర్యాదు:
ఇన్నింగ్స్ అనంతరం బ్రేక్ సమయంలో స్టేడియంలో అంపైర్లకు కేటాయించిన రూమ్కు ఆగ్రహంతో వెళ్లిన లాంగ్.. డోర్ను కాలితో గట్టిగా తన్ని ధ్వంసం చేశాడు. అనంతరం స్టేడియం అధికారులతో గొడవ తర్వాత కర్ణాటక క్రికెట్ సంఘాని (కేసీఏ)కి లాంగ్ రూ.5వేలు చెల్లించాడు. ఈ వివాదంపై బీసీసీఐకి కేసీఏ ఫిర్యాదు చేసింది.
ఫైనల్ మ్యాచ్కు అంపైర్గా:
అయితే ఐపీఎల్ను పర్యవేక్షిస్తున్న వారితో చర్చించిన క్రికెట్ పాలక కమిటీ.. అంపైర్ నిగెల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచింది. దీంతో షెడ్యూల్ ప్రకారం నిగెల్ ఫైనల్ మ్యాచ్కు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హైదరాబాద్ వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.