హైదరాబాద్: రోజురోజుకూ ధోనీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. బెస్ట్ ఫినిషర్, మిస్టర్ కూల్గా.. టీమ్ ఇండియాను ముందుండి నడిపించి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. మరోవైపు అదే స్థాయిలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్లో ధోనీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ను చూడటానికి ఏకంగా రైలు కట్టుకొని వచ్చి మరీ చెన్నైను దగ్గరుండి ఉత్సాహాపరిచారు.
ఈ క్రమంలో పుణె వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా ముందుగా ఓ సీఎస్కే అభిమాని అక్కడి సిబ్బందిని సైతం నెట్టుకొని వచ్చి మరీ ధోనీ పాదాలపై పడ్డాడు. ఉద్వేగంతో ధోనీని హత్తుకొని ఆనందంతో పొంగిపోయాడు. ఈ క్రమంలోనే మరోవైపు ప్రేక్షకుల గ్యాలరీలో ఓ యువతి ధోనీపై తనకున్న అభిమానాన్ని ప్లకార్డు చూపిస్తూ చాటుకుంది.
💕 @msdhoni 😍#CSKvRR #IPL2018 pic.twitter.com/j2t5Scuwzs
— ICC (@ICC) April 20, 2018
— puvanesh pugal (@puvanesh_pugal) April 20, 2018
ఆ ప్లకార్డులో 'ఎప్పటికైనా ఎంఎస్ ధోనీనే నా తొలి ప్రేమ. కాబోయే భాగస్వామికి ముందుగా నా క్షమాపణలు. ఐ లవ్ యూ ధోనీ.. అంటూ' రాసి ఉంది. అయితే దీనిపై ధోనీ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. కొందరైతే ఏకంగా ధోనీ భార్య సాక్షి కోపంగా చూస్తున్న ఫొటోను జోడించి చమత్కరిస్తున్నారు.