హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నలుగురు చిన్నారులు ఎదురైయ్యారు. వారిని తప్పించుకుపోలేకపోయాడు. ఐపీఎల్ 11లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి సారి మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే బెంగుళూరు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. అయితే ప్రాక్టీసు ముగించుకుని హోటల్కు చేరుకున్న విరాట్ కోహ్లీకి నలుగురు చిన్నారులు అతని కోసం ఎదురుచూస్తూ ఉండడం గమనించాడు.
వారంతా గ్రీటింగ్ కార్డులతో కోహ్లీని విష్ చేస్తూనే ఆటోగ్రాఫ్లు అడగడం చూసి మురిసిపోయాడు. వాళ్లలో కొందరికీ పేపర్లపై ఆటోగ్రాఫ్ లు ఇచ్చి, మరొకరిపై టోపీపై సంతకం చేసి, ఎమ్మారెఫ్ బ్యాట్పై కూడా ఆటోగ్రాఫ్ చేసి వారికందించాడు. అనంతరం ఆ వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మిగిలిన అభిమానులతో పంచుకున్నాడు.
Always love meeting such confident kids. Such positive energy. 😊 pic.twitter.com/HcVuCb7vQR
— Virat Kohli (@imVkohli) April 24, 2018
కోహ్లీ చేసిన పోస్టులో.. కాన్ఫిడెంట్గా ఉన్న అలాంటి చిన్నారులను కలిసినప్పుడు కొత్త పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది' అని పేర్కొన్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్లలో జట్టు రెండింటిలో గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లన్నింటిలో కోహ్లీ ఒక్కడే 231పరుగులు చేసి 57.75 యావరేజిని కలిగి ఉన్నాడు. సీజన్ మొదలైనప్పటి నుంచి పరుగులు అధికంగా తీసే వారి జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే విరాట్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి చివరి నుంచి మూడో స్థానంలో మాత్రమే ఉంది. కాగా, నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతోన్న చెన్నై జట్టును ఢీకొననుంది.