హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 టైటిల్ స్పాన్సర్స్ టెండర్ల ప్రక్రియ మే 31, 2017న ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుత స్పాన్సర్ 'వివో'తో ఒప్పందం ఈ సీజన్తో ముగుస్తుంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ, బీసీసీఐ పాలనా కమిటీ టెండర్ల ప్రక్రియ ప్రారంభానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఇందుకోసం ఢిల్లీలో సోమవారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశానికి బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యులు వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా సైతం హాజరు కానున్నారు.

పీటీఐలో వచ్చిన వార్తా కథనం ప్రకారం బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ టెండర్ల ఆహ్వానం మే 31, 2017న ఉంటుంది. ఐపీఎల్ ఈవెంట్ సర్వీసుల కాంట్రాక్టుకు జూన్ 12, మీడియా రైట్స్ టెండర్లకు ఆహ్వానం జులై 17న ఉంటుంది. ఈ ఒప్పందాలన్నీ కూడా రాబోయే ఐదేళ్ల కాలానికి ఉండనున్నాయి.