న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జైపూర్‌ను ‘పింక్‌ గౌతమ్ సిటీ’గా మార్చాలి: ట్విట్టర్‌లో ఓ అభిమాని

By Nageshwara Rao
 IPL 2018, RR vs MI: Twitterati say ‘rename Jaipur to Gowtham city’ after Royals defeat Mumbai

హైదరాబాద్: ఏప్రిల్ 7న మొదలైన ఐపీఎల్ 11వ సీజన్ ఇప్పుటికీ ఆసక్తికరంగా మారింది. హోరాహోరీ మ్యాచ్‌లు, ఊహించని ట్విస్టులు, అనూహ్య ఫలితాలతో రోజురోజుకు అభిమానులను అలరిస్తోంది. టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్‌ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో అలరించింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబైపై రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో 33 పరుగులు చేసి రాజస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించిన గౌతమ్ కృష్ణప్పపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణప్పపై ప్రశంసలు

రాజస్థాన్‌ను ఓటమి అంచు నుంచి విజయ తీరాలకు చేర్చిన గౌతమ్ కృష్ణప్పను సోషల్‌ మీడియాలో ఆకాశానికెత్తుతున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్‌‌లో గౌతమ్‌ కొనియాడుతూ జైపూర్‌ను ‘పింక్‌ గౌతం సిటీ' గా మార్చాలంటూ పోస్టు పెట్టింది. దీంతో కనీసం ఒక్కరోజైనా జైపూర్‌ పేరును గౌతం సిటీగా మార్చాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

రాజస్థాన్ విజయంలో కృష్ణప్ప గౌతమ్‌ కీలకపాత్ర

‘గోథం బ్యాట్‌మన్‌ (సూపర్‌హీరో సిరీస్‌)ను ఇస్తే.. గౌతం బ్యాట్స్‌మన్‌ను ఇచ్చాడు' అని చమత్కరిస్తున్నారు. గౌతం సిటీలో అద్భుతమైన బ్యాట్‌మన్‌ ప్రతిభ చూశామని పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు సంజూ శాంసన్‌(52), బెన్‌స్టోక్స్‌ (40), కృష్ణప్ప గౌతమ్‌(33) రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన రాజస్థాన్

ముంబై బౌలర్లు పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(72), ఇషాన్‌ కిషన్‌ (58), పొలార్డ్‌(21)లు రాణించారు. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

కెప్టెన్‌ రహానే మాటలే నాకు బలమిచ్చాయి

కెప్టెన్‌ రహానే మాటలే నాకు బలమిచ్చాయి

అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం గౌతమ్‌ కృష్ణప్ప మాట్లాడుూ ‘జస్ట్‌ బిలీవ్‌ దట్‌ యు కెన్‌' అన్న కెప్టెన్‌ రహానే మాటలే తనకు బలమిచ్చాయని, కనీసం ఆఖరి బంతికైనా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే ఆడానని చెప్పాడు.

Story first published: Monday, April 23, 2018, 18:14 [IST]
Other articles published on Apr 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X