|
సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణప్పపై ప్రశంసలు
రాజస్థాన్ను ఓటమి అంచు నుంచి విజయ తీరాలకు చేర్చిన గౌతమ్ కృష్ణప్పను సోషల్ మీడియాలో ఆకాశానికెత్తుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్లో గౌతమ్ కొనియాడుతూ జైపూర్ను ‘పింక్ గౌతం సిటీ' గా మార్చాలంటూ పోస్టు పెట్టింది. దీంతో కనీసం ఒక్కరోజైనా జైపూర్ పేరును గౌతం సిటీగా మార్చాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
|
రాజస్థాన్ విజయంలో కృష్ణప్ప గౌతమ్ కీలకపాత్ర
‘గోథం బ్యాట్మన్ (సూపర్హీరో సిరీస్)ను ఇస్తే.. గౌతం బ్యాట్స్మన్ను ఇచ్చాడు' అని చమత్కరిస్తున్నారు. గౌతం సిటీలో అద్భుతమైన బ్యాట్మన్ ప్రతిభ చూశామని పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు సంజూ శాంసన్(52), బెన్స్టోక్స్ (40), కృష్ణప్ప గౌతమ్(33) రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
|
7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన రాజస్థాన్
ముంబై బౌలర్లు పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(72), ఇషాన్ కిషన్ (58), పొలార్డ్(21)లు రాణించారు. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
కెప్టెన్ రహానే మాటలే నాకు బలమిచ్చాయి
అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం గౌతమ్ కృష్ణప్ప మాట్లాడుూ ‘జస్ట్ బిలీవ్ దట్ యు కెన్' అన్న కెప్టెన్ రహానే మాటలే తనకు బలమిచ్చాయని, కనీసం ఆఖరి బంతికైనా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే ఆడానని చెప్పాడు.