

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన వేలంలో తమకు నచ్చిన ఆటగాళ్లను ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీ20 స్పెషలిస్టులను వేలంలో సొంతం చేసుకుంది.
వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో 21 మందిని కొనుగోలు చేసింది. ఇందులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రిస్ వోక్స్కు అత్యధికంగా రూ. 7.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
మొత్తం జట్టు సభ్యులు - 24; బ్యాట్స్మెన్ - 6; బౌలర్లు - 9; వికెట్ కీపర్లు - 2; ఆల్ రౌండర్లు - 7; విదేశీ ఆటగాళ్లు - 8
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు - 3; వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 21
అత్యధిక ధర పలికిన ఆటగాడు - విరాట్ కోహ్లీ (రూ. 17 కోట్లు)
అత్యధిక ధర పలికిన ఆటగాడు - క్రిస్ వోక్స్ - రూ 7.4 కోట్లు
ఖర్చు పెట్టిన డబ్బు - రూ. 79.85 కోట్లు
ప్రాంఛైజీ వద్ద మిగిలిన డబ్బు - రూ. 15 లక్షలు
వేలం అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు:
1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు-Retained)
2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు-Retained)
3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు- Retained)
4. మెకల్లమ్ (రూ.3.6 కోట్లు)
5. క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు)
6. కొలిన్ గ్రాండ్హోమ్ (రూ.2.2 కోట్లు)
7. మొయిన్ అలీ (రూ1.7 కోట్లు)
8. క్వింటన్ డీకాక్ (ర.2.8 కోట్లు)
9. ఉమేష్ యాదవ్ (రూ.4.2 కోట్లు)
10. యజువేంద్ర చాహల్ (రూ.6 కోట్లు-RTM)
11. మనన్ వోహ్రా (రూ.1.1 కోట్లు)
12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ.85 లక్షలు)
13. అనికేత్ చౌదరి (రూ.30 లక్షలు)
14. నవదీప్ సైనీ (రూ.3 కోట్లు)
15. మురుగన్ అశ్విన్ (రూ.2.2 కోట్లు)
16. మణ్దీప్ సింగ్ (రూ.1.4 కోట్లు)
17. వాషింగ్టన్ సుందర్ (రూ.3.2 కోట్లు)
18. పవన్ నేగి (రూ.కోటి-RTM)
19. మహ్మద్ సిరాజ్ (రూ.2.6 కోట్లు)
20. నేథన్ కూల్టర్ నైల్ (రూ.2.2 కోట్లు)
21. అనిరుద్ధ జోషి (రూ.20 లక్షలు)
22. పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు)
23. టిమ్ సౌథీ (రూ.కోటి)
24. పవన్ దేశ్పాండె (రూ.20 లక్షలు)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.