
హైదరాబాద్: క్రికెట్ భవిష్యత్పై వస్తున్న వదంతులను కొట్టి పడేస్తూ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు ట్వీట్ చేశాడు. అద్భుతమైన సన్రైజర్స్ బౌలింగ్లోనే సెంచరీ బాదేసిన యువ సంచలనం, ఢిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ త్వరలోనే భారత జాతీయ జట్టుకు ఆడతాడని మాజీ కెప్టెన సౌరవ్ గంగూలీ ఇటీవల ఓ సమావేశంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో తనను టీమిండియాకు ఎంపిక చేయలేదంటూ పంత్ వ్యాఖ్యానించినట్లు కథనాలు ప్రచారమవుతూ ఉన్నాయి. దీంతో తనపై వచ్చిన వదంతులపై ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పంత్ ఇలా ఖండించాడు.
'టీమిండియాకు ఎంపిక చేయలేదని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ నన్ను ఇటీవల ప్రకటించిన భారత జట్టుకు ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చుకుంటున్నాను. ఇక నుంచి కెరీర్పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరుకుంటున్నా' అని పంత్ ట్వీట్ చేశాడు.
ఈ ఐపీఎల్లో అత్యధిక (582) పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా పంత్ ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే, టీ20లకు, ఐర్లాండ్తో టీ20లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత రహానే లాంటి ఆటగాడిని పక్కన పెట్టడంతో 'దాదా' గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ ఆటతీరుతో పాటు నిలకడ ప్రదర్శిస్తే పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ కెరటాలు భారత్కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో దూరంలో లేరన్నాడు.
లీగ్ మొత్తంలో 12మ్యాచ్లు ఆడి 4 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీని సైతం పూర్తి చేయగలిగాడు. కేవలం ఐపీఎల్లోనే 61 ఫోర్ బౌండరీలు, 31 సిక్స్ బౌండరీలను సాధించాడు.