న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చక్కటి రెస్పాన్స్: కోహ్లీ ఛాలెంజ్‌ని స్వీకరించిన రషీద్ ఖాన్ (వీడియో)

By Nageshwara Rao
IPL 2018: Rashid Khan takes up the three run challenge

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ ఛాలెంజ్‌కి దేశ వ్యాప్తంగా అభిమానులు తమ మద్దతుని తెలియజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా అడపా దడపా పలువురు ఆటగాళ్లు ఈ 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ స్వీకరించారు.

అయితే, ఇప్పుడు 'త్రీ రన్స్‌' ఛాలెంజ్‌ను క్రికెటర్లు స్వీకరిస్తున్నారు. అసలేంటి ఈ 'త్రీ రన్స్‌' ఛాలెంజ్. వికెట్ల మధ్య వేగంగా మూడు పరుగులు సాధించడం. ఎవరైతే తక్కువ సమయాన్ని నమోదు చేస్తారో వారే విజేతలు. తొలుత ఈ ఛాలెంజ్‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు.

ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను తర్వాత స్వీకరించాలని సహచర ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌కు సూచించాడు. దీంతో మన్‌దీప్‌ తర్వాత లూయిస్‌, షకీబ్‌ ఆల్‌ హాసన్‌ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. తాజాగా ఈ ఛాలెంజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ కూడా స్వీకరించాడు.

రషీద్ ఖాన్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా తన సహచర ఆటగాళ్లు బిపుల్‌ శర్మ, సచిన్‌ బేబీకి సూచించాడు. రషీద్‌ఖాన్‌ తన ఛాలెంజ్‌ను 10.50 సెకన్లలో పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని రషీద్ ఖాన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న వారిలో కోహ్లీనే ముందున్నాడు. కోహ్లీ కేవలం 8.90సెకండ్లలోనే మూడు పరుగులు పూర్తి చేశాడు.

Story first published: Tuesday, May 22, 2018, 18:19 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X