హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో 'బ్రేక్ ద బియర్డ్' ఛాలెంజ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ ఛాలెంజ్కి దేశ వ్యాప్తంగా అభిమానులు తమ మద్దతుని తెలియజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా అడపా దడపా పలువురు ఆటగాళ్లు ఈ 'బ్రేక్ ద బియర్డ్' ఛాలెంజ్ స్వీకరించారు.
అయితే, ఇప్పుడు 'త్రీ రన్స్' ఛాలెంజ్ను క్రికెటర్లు స్వీకరిస్తున్నారు. అసలేంటి ఈ 'త్రీ రన్స్' ఛాలెంజ్. వికెట్ల మధ్య వేగంగా మూడు పరుగులు సాధించడం. ఎవరైతే తక్కువ సమయాన్ని నమోదు చేస్తారో వారే విజేతలు. తొలుత ఈ ఛాలెంజ్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు.
ఆ తర్వాత ఈ ఛాలెంజ్ను తర్వాత స్వీకరించాలని సహచర ఆటగాడు మన్దీప్ సింగ్కు సూచించాడు. దీంతో మన్దీప్ తర్వాత లూయిస్, షకీబ్ ఆల్ హాసన్ ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. తాజాగా ఈ ఛాలెంజ్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కూడా స్వీకరించాడు.
రషీద్ ఖాన్ ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా తన సహచర ఆటగాళ్లు బిపుల్ శర్మ, సచిన్ బేబీకి సూచించాడు. రషీద్ఖాన్ తన ఛాలెంజ్ను 10.50 సెకన్లలో పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని రషీద్ ఖాన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్లో పాల్గొన్న వారిలో కోహ్లీనే ముందున్నాడు. కోహ్లీ కేవలం 8.90సెకండ్లలోనే మూడు పరుగులు పూర్తి చేశాడు.
Think you can run faster than me? 🤔 Here’s my fastest time for 3 runs. Pad up and send a video of your fastest 3 runs mentioning #NewLevels and @PUMACricket . @mandeeps12 let’s see if you can beat 8.90 sec mundeya! 😏 pic.twitter.com/UOdl64NZs6
— Virat Kohli (@imVkohli) April 28, 2018