నవ్వులు పూయించిన రాయుడి రనౌట్
రాయుడి రనౌట్ చెన్నై జట్టులో కూడా నవ్వులు పూయించింది. చెన్నై ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఆఖరి ఓవర్ ఐదో బంతిని ఎదుర్కొన్న చెన్నై కెప్టెన్ ధోని పుల్ షాట్గా ఆడాడు. అయితే అది బ్యాట్ ఎడ్జిని తీసుకుని లెగ్ సైడ్గా వెళ్తోన్న బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతికష్టం మీద ఆ బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు.
సింగిల్ తీసేందుకు పరిగెత్తిన రాయుడు
అదే సమయంలో అంబటి రాయుడు సింగిల్ తీసేందుకు క్రీజు నుంచి పరిగెత్తాడు. అయితే బంతి వికెట్ కీపర్ చేతికి చిక్కడంతో ధోని మాత్రం కదల్లేదు. రాయుడు మాత్రం సింగిల్ తీద్దామనే ఉద్దేశ్యంతో స్టైకర్ ఎండ్కు పరిగెత్తడం, దానిని ధోని గమనించకపోవడం... మరోవైపు కీపర్ నుంచి బంతిని అందుకున్న ట్రెంట్ బౌల్ట్ వికెట్లను గిరాటేయడం చకా చకా జరిగిపోయాయి.
|
నిరాశగా పెవిలియన్కు చేరిన రాయుడు
దీంతో రాయడు (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, ఒక సిక్సు) పరుగుల వద్ద నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని డగౌట్లో నుంచి చూస్తున్న చెన్నై ఆటగాళ్లను సైతం నవ్వులు పూయించింది. రాయుడి రనౌట్ చూసి బ్రావో అయితే పగలబడి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్లో అభిమానులతో పంచుకుంది.
13 పరుగుల తేడాతో చెన్నై విజయం
ఇదిలా ఉంటే ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం భారీ బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.